బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన ఆరోగ్యంపై పలు పుకార్లు వినిపించినా.. ఆయన మాత్రం ఇంట్లోనే ఉన్నారు. ఇటీవల మరింతగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో.. కుటుంబ సభ్యులు రాంచీలోని రిమ్స్ లో చేర్పించారు. ఇప్పుడు ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్కు తరలించాలని రిమ్స్ మెడికల్ బోర్డు సూచించిడంతో హుటా హుటిన లాలూని రాత్రి ఢిల్లీ తరలించారు. ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.