ఒక్క ఇల్లాలితోనే కాపురం చేయడం కష్టం. అలాంటిది ముగ్గురితో వేగడం అంటే మాటలా. కానీ మౌర్య అనే వ్యక్తి ముగ్గురు మహిళలను పెళ్ళి చేసుకున్నాడు. అదీ కూడా 15 ఏళ్ళ సహజీవనం తర్వాత. మధ్యప్రదేశ్ రాష్ట్రం అలీరాజ్ పూర్ జిల్లా నాన్ పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
మౌర్య అనే వ్యక్తి ఒకేసారి ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆరుగురు పిల్లలు పుట్టారు. వారి సహజీవనం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేనేళ్ళ పాటు సాగింది. అయితే ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనతో ముగ్గురిని ఒకే వేదికపై పెళ్ళి చేసుకున్నాడు. ఆరుగురు పిల్లల సమక్షంలో గ్రామస్తులందరినీ పెళ్ళికి ఆహ్వానించి అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకున్నాడు. మొత్తానికి వీరి పెళ్ళికి వచ్చిన వారంతా నవ దంపతులను ఆశీర్వదించారు.
Madhya Pradesh: A man living in a live-in relationship with three women entered into a wedlock with all the three in the presence of the entire village. The wedding took place in Nanpur village in the tribal-dominated Alirajpur district. pic.twitter.com/oePIwFb5ss
— Free Press Journal (@fpjindia) May 2, 2022