నడిచే థియేటర్..
ఇప్పుడు ఏపీకి వచ్చేసింది చూడండి..
సినిమా చూడాలంటే ఇకపై థియేటర్ కు వెళ్లాల్సిన ఆవాసం లేదు. ఎందుకంటే ఆ థియేటర్ కూడా మన ఇంటి పక్కకి రాబోతోంది. అవునండి.. ఇది నిజం.. చక్రాల థియేటర్లు ఇపుడు రాష్ట్రంలో మొదటి సారిగా అందుబాటులోకి వచ్చింది. మొబైల్ సినిమా ధియేటర్ పేరుతో పిలవబడే ఈ థియేటర్ తొలిసారిగా మన ఏపీలోనే అందుబాటులోకి రాబోతోంది. ఈ థియేటర్ ను ట్రక్కులో ఎక్కడినుంచి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళచ్చు.
ప్రస్తుతానికి రాజానగరం వద్ద నేషనల్ హైవే పక్కన హాబిటేట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో ఈ ధియేటర్ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రకాల వాతావరణాల్లోనూ ఈ థియేటర్ లో సినిమా చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వెదర్ ప్రూఫ్, ఫైర్ ఫ్రూఫ్ పద్ధతుల్లో వేసిన టెంట్ లో గాలి నింపే టెక్నాలజీతో 120 సీట్ల కెపాసిటీతో ఈ ఏసీ ధియేటర్ ను రూపొందిస్తున్నారు.“పిక్చర్ డిజిటల్స్” సంస్ధ తొలిసారిగా ఏపీలో ఇటువంటి మొబైల్ ధియేటర్ ను ఏర్పాటు చేస్తోంది. తొలిసారిగా ఈ థియేటర్లో మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా ప్రదర్శించనున్నారు.