ఈ దొంగ ఎవడోగానీ ఏకంగా యుద్ధ విమానం టైరు చోరీచేశాడు.. వినేందుకు విచిత్రంగా ఉన్నా , ఇది నిజం.. ఇప్పుడీ చోరీ పోలీసులకు సవాల్ గా మారింది.. ఈ చోరీ ఎక్కడొకడు.. మనదేశంలోనే.. చాటుమాటుగా జరిగిందికూడా కాదు.. రద్దీగా ఉన్న ట్రాఫిక్ లోనే.. ఉత్తరప్రదేశ్ లోని , బక్షికా తలాబ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి , జోధ్ పూర్ కు , ఒక ట్రాలీలో మిరేజ్ యుద్ధవిమానాన్ని తరలిస్తున్నారు.
ఆశియానా అనే పోలీస్ లిమిట్స్ నుంచి , షహీద్ పథ్ నుంచి ట్రాలీ పోతుండగా , ఒకచోట ట్రాలీ ట్రాఫిక్ లో చిక్కుకుంది. ఆ సమయంలో యుద్ధ విమానం ఐదు టైర్లలో , ఒక టైరు చోరీకి గురైంది.. ఈ విషయం గమనించిన ట్రాలీ డ్రైవర్ హేమసింగ్ రావత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు..