మంత్రి ప్రియురాలి ఇంట్లో 20 కోట్లు డబ్బు.

    0
    1461

    పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలి ఇంట్లో 20 కోట్ల రూపాయల కరెన్సీ గుట్టలుగా పడి ఉంది. మంత్రి పార్ధకు ఆమె చాలా సన్నిహితురాలు. 20 కోట్ల రూపాయల కరెన్సీ కట్టలుగా పది ఉన్న తీరు చూసి , ఈడీ అధికారులు విస్తుపోయారు. మంత్రి సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీ ఇంట్లో ఈడీ నిర్వహించిన సోదాల్లో ఏకంగా రూ. 20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ , ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డులో అవకతవకలకు సంబంధించిన మోసం కేసులో ఈడీ అధికారులు అర్పిత ఇంటిపై దాడి చేశారు. ఈ సందర్భంగా పట్టుబడిన సొమ్మును ఎస్ఎస్‌సీ కుంభకోణంలో కూడబెట్టినదిగా అనుమానిస్తున్నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.

    పట్టుబడిన సొమ్మును లెక్కించేందుకు బ్యాంకు అధికారుల సాయం తీసుకున్నామని, క్యాష్ కౌంటింగ్ మెషీన్లను ఉపయోగించి నోట్లను లెక్కించినట్టు చెప్పారు. ఛటర్జీతో పాటు విద్యాశాఖ సహాయ మంత్రి పరేష్ సి అధికారి, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య తదితరుల నివాసాలపైనా ఈడీ దాడులు నిర్వహించింది. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న పార్థ ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో అక్రమ నియామకాలు జరిగినట్టు అధికారులు ఆరోపించారు. ఈ దాడులను అధికార తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కేంద్రంలోని బీజేపీ చేసిన కుట్రగా అభివర్ణించింది.

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.