40 పైసలు కోసం 4 వేలు కట్టాడు..

    0
    158

    కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్నది సామెత, 40 పైసల కోసం కోర్టుకి పోయిన ఓ పెద్దాయన 4000 ఫైన్ కట్టాల్సివచ్చింది. బెంగళూరులో మూర్తి అని ఓ పెద్దాయనకి ,ఒక లెక్కుంది , అయితే ఆ లెక్కకి ఒక తిక్క ఉంది.. మూర్తి అనే ఈ పెద్దాయన హోటల్ కి వెళ్ళాడు ఆ హోటల్లో బిల్లు 264 రూపాయలు 60 పైసలు అయింది అయితే బిల్లింగ్ లో దాన్ని 265 రూపాయలు రౌండప్ చేశాడు చేసి కట్టమన్నారు.

    40 పైసలు ఎక్కువ ఎందుకు కట్టాలని మూర్తి వారితో వాగ్వాదానికి దిగాడు . అది టాక్స్ మొత్తం అని , టాక్స్ సంబంధించి రౌండ్ ఫిగర్ చేయవచ్చునని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలున్నాయని హోటల్ వాళ్ళు చెప్పారు. అయినా వారి మాటలను వినలేదు , తగాదా వేసుకొని , చివరకు 265 రూపాయలు బిల్లు కట్టేసి వచ్చేసాడు. దీంతో ఆ బిల్లు తీసుకుని తన వద్ద 40 పైసలు ఎక్కువ వసూలు చేశారని కేసుపెట్టాడు.

    కేసు విచారించిన న్యాయమూర్తులు మూర్తిని తీవ్రంగా మందలించి 4000 రూపాయలు ఫైన్ కట్టమని ఆదేశించారు. ఇందులో 2000 రూపాయలు హోటల్ కి , 2000 రూపాయలు కోర్టు ఖర్చులకు జమ చేసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది వ్యక్తిగత ప్రచారం కోసం ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు తమ వద్దకు తీసుకు రావద్దని కూడా హెచ్చరించింది. చౌకబారు ప్రచారంకోసం ఇలా కోర్టు సమయాన్ని వృధాచేయ్యొద్దని మందలించారు..

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..