నదిలో స్నానం చేస్తూ , మొసలి నోటికి చిక్కి..

    0
    966

    నదిలో ఈతకు పోయిన తమిళనాడు డీఎంకే నేత ఒకరిని మొసలి చంపి తినేసింది.. చిదంబరం సమీపంలోని పలాయనల్లూరుకు చెందిన డీఎంకే కార్యదర్శి గోపాల కృష్ణన్ నదిలో ఈతకు దిగాడు. ఆయనతో ఇద్దరు సోదరులుకూడా ఉన్నారు. వెనకున్న సోదరులు చూస్తుండగానే , మొసలి గోపాల కృష్ణన్ ను పట్టేసింది. దీంతో భయపడి ఒడ్డుకువొచ్చేసిన సోదరులు , సమీపం లోఉన్న వాళ్ళను పిలిచి మొసలిపై రాళ్లు విసిరి తరిమే ప్రయత్నం చేశారు. అయితే అందరూ చూస్తుండగానే , అది ఆయనను నీటిలోకి లాక్కెల్లింది. తర్వాత పోలీసు , ఫైర్ , అటవీశాఖ అధికారులు వచ్చి గాలించగా , సగం దేహమే ఛిద్రమై మిగిలింది. రెండేళ్ల క్రితం , గోపాలకృష్ణన్ మరో సోదరుడు , ఇలాగే ఇదే నదిలో స్నానం చేస్తూ , మొసలి నోటికి చిక్కి దానికి ఆహారమయ్యాడు.. ఇప్పడు ఆయనకు తమ్ముడూ ఇలాగే అయ్యాడు.. ఇదే విధి విచిత్రమంటే…

    ఇవీ చదవండి..

    మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

    25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్