కర్ణాటకలో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోగా.. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి.
హుబ్లీ సరిహద్దుల్లో పూణే బెంగుళూరు హైవేపై ఈ ప్రమాదం రాత్రి 12 గంటల సమయంలో జరిగింది. బస్సు ఒక ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయబోయి.. ఎదురుగ వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ, బస్సు డ్రైవర్లు ఇద్దరూ స్పాట్ లోనే చనిపోయారు.
రెండు వాహనాలూ ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనిని బట్టి.. ఆ వాహనాల వేగం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. గాయపడిన వారికి హుబ్లీ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారంతా కొల్హాపూర్ నుంచి బస్సులో బెంగుళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.