భారీ వర్షాల్ల విధ్వంసం చిత్తూరు , కడప , అనంతపురం , నెల్లూరు జిల్లాలను కకావికలం చేసింది.. భారీ స్థాయిలో నష్టాలను , ప్రజలకు కడగండ్లు మిగిల్చింది. కడప జిల్లాలో అయితే ప్రాణనష్టంకూడా జరిగింది.. వీధులే , నదులై పారిన ఘోరం జరిగింది. కడప జిల్లాలో ప్రధానమైన కమలాపురం వద్ద వంతెన కూలిపోయింది. పాపాగ్ని నదిపై ఉన్న ఈ వంతెన , కడప – అనంతపురం జిల్లాలకు వారధిగా ఉంది. వెలిగల్లు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలిపెడుతున్నారు. దీంతో రెండు రోజులుగా భారీగా వరద నీరు వంతెనపై అంచు వరకు ప్రవహిస్తోంది. వరద ధాటికి చీలిపోయిన బ్రిడ్జి క్రమ క్రమంగా కూలిపోయింది.
Rain Fury: #Kamalapuram bridge on #Papagni river in #Kadapa damaged due to floodwaters.#AndhraPradesh #Andhrapradeshrains pic.twitter.com/15yI2qEEiJ
— dinesh akula (@dineshakula) November 21, 2021