తాగినోడు అబద్దం చెప్పడు. నిజం చెప్తాడో లేదో తెలియదు కానీ తాగినోడు అబద్దం చెప్పడని నానుడి. ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ అధికారి ఆర్.పి.కిరార్ కూడా ఇదే మాట చెబుతున్నాడు. అసలు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే, మధ్యప్రదేశ్ లోని కంద్వా జిల్లాలో మద్యం కొనాలంటే కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుని ఉండాలి. అలా వేసుకున్న వారికే షాపులో మద్యం ఇస్తారు. ఈ మేరకు అధికారి లిఖిత పూర్వక ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఇక్కడ ఓ వెసులుబాటు కూడా ఇచ్చారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నట్లు, సర్టిఫికెట్లు ఏమీ చూపించాల్సిన అవసరం లేదు. రెండు డోసులు వేసుకున్నానని చెబితే చాలు మద్యం ఇచ్చేస్తారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోకున్నా.. వేసుకున్నట్లు చెప్పి, మద్యం అడిగితే ఇస్తారా ? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆ అధికారి చెప్పిన సమాధానం.. భారతదేశంలో తాగినవాడు ఎప్పుడూ అబద్దం చెప్పడు. నిజమే చెప్తాడు. తాగిన వాడు నిజమే చెప్తాడనే నమ్మకం ఉందన్నాడు. ఆయన ఏమన్నాడో ఈ వీడియోలో చూడండి.
Madhya Pradesh: 'Hindustan me Daru pinewala sahi bolta hai', says Khandwa District Excise Officer RP Kirar. The department has issued an order that only those who have been jabbed will be allowed to buy liquor from shops. pic.twitter.com/LWaCh2mEMs
— Free Press Journal (@fpjindia) November 18, 2021