కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు కొంత తగ్గిన విషయం తెలిసిందే. అయితే వివిధ రాష్ట్రాలు ఆ మేరకు వ్యాట్ కూడా తగ్గించడంతో అక్కడ రేటు ఇంకా తగ్గింది. ఏపీ, తమిళనాడుతో పోల్చి చూస్తే తమ వద్ద పెట్రోలు తక్కువ అంటూ కర్నాటకలో ఏకంగా బ్యానర్లు వెలిశాయి.
ఆంధ్ర, కర్నాటక బోర్డర్ లోని రాళ్ల బుడుగూరు దగ్గర ఉన్న కెంప పుర పెట్రోల్ బంకు వద్ద ఇలా బ్యానర్ పెట్టి మరీ అమ్ముతున్నారు.