రష్యా యుద్ధం ఆపుతున్నా.. అస్సలు నిద్ర లేదు..
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి నవ్వులు పూయించాడు. రష్యా.. ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ఇటీవల కొంతకాలంగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు. గత ఏడాది డిసెంబర్ 5 నుంచి ఏప్రిల్ వరకూ యుద్ధం ఆపేందుకు నిద్ర కూడా పోకుండా ప్రయత్నించానని అన్నాడు. యుద్ధం ఆపే బిజీలో, నిద్ర లేకపోవడంతో ఐదు కేజీల బరువు పెరిగానని.. అందుకే వ్యాయామం చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.
అందరూ వ్యాయామం చేయాలనీ సలహాలు కూడా ఇచ్చాడు. అమీర్ పేట ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో శని, ఆదివారాలు ఉంటున్నట్ట్టు తెలిపాడు. ఎవరైనా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా మారాలంటే తన కార్యాలయంలో మూడు నుంచి ఏడూ వరకూ ఉంటాను రండి అని పిలుస్తున్నాడు.
https://www.facebook.com/DrKAPaulOfficial/videos/749797053069502