తమిళనాడులో భారీ వర్షాలకు చెన్నై ప్రజలు అల్లాడిపోతున్నారు. వారం రోజులుగా సీఎం స్టాలిన్ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు భరోసానిస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఎక్కడా కనపడ్డం లేదు. సహజంగా ఇలాంటి సందర్భాల్లో ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి, ప్రభుత్వంపై బురదజల్లుతాయి. కానీ ఇటీవలే తమిళనాడులో ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రతిపక్షాలు ఒకవేళ బురదజల్లాలనుకుంటే.. అది కచ్చితంగా తమపైనే వేసుకోవాలి. గత ప్రభుత్వంలో తాము ఏమీ చేయలేకపోయినట్టు ఒప్పుకోవాలి. అందుకే అన్నాడీఎంకే సైలెంట్ అయింది. తాజాగా.. కమల్ హాసన్ రంగంలోకి దిగారు.
పెరియార్ నగర్ & శాస్త్రి నగర్, వేలచ్చేరి, అంబేద్కర్ నగర్, వెస్ట్ మాంబలం, గాంధీ వీధి, వడివేల్ పురంలో పర్యటించి వరద బాధితులకు ప్రజా న్యాయ కేంద్రం తరపున సహాయ సామాగ్రిని పంపిణీ చేశారు.
தரமணி தந்தை பெரியார் நகர் & சாஸ்திரி நகர், வேளச்சேரி அம்பேத்கர் நகர், மேற்கு மாம்பலம் காந்தி தெரு, வடிவேல்புரம் ஆகிய பகுதிகளில் வெள்ளபாதிப்புகளைப் பார்வையிட்டு, மழையினால் பாதிக்கப்பட்டவர்களுக்கு மக்கள் நீதி மய்யம் சார்பாக நிவாரணப் பொருட்களை வழங்கினேன். pic.twitter.com/C4qS3DmnE9
— Kamal Haasan (@ikamalhaasan) November 12, 2021