కాకినాడలో ఐడీఎల్ విద్యాసంస్థల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఐడీఎల్ విద్యా సంస్థలను ప్రైవేటుపరం చేయడం సరికాదని, ప్రభుత్వం ఎయిడ్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కాకినాడ కలెక్టరేట్ ని ముట్టడించారు. ఈక్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఒక సందర్భంలో మెయిన్ గేటు నెట్టివేసుకుండూ విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల చేతుల్లో విద్యార్థులు లాఠీ దెబ్బలు తిన్నారు.
తమ భవిష్యత్తును కూల్చుతున్న జగన్ సర్కారుపై విద్యార్థి లోకం మండిపడుతోంది. ఎయిడెడ్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయొద్దని, ప్రభుత్వమే కళాశాలలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ కలెక్టరేట్ ను విద్యార్థిని, విద్యార్థులు ముట్టడించారు. pic.twitter.com/IUFe7lJCSH
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) November 12, 2021
ఇటీవల అనంతపురంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇప్పుడు కాకినాడలో కూడా విద్యార్థులపై లాఠీ విరిగింది.