ఎలక్ట్రిక్ బైక్ ల విభాగంలో సత్తా చూపించేందుకు అన్ని కంపెనీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇంధన ధరలు భారీగా పెరిగిపోతుండటంతో రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల గిరాకీ పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో.. బూమ్ మోటర్స్ తాజాగా విద్యుత్తుతో నడిచే వాహన సెగ్మెంట్ లోకి ప్రవేశించింది. ‘బూమ్ కార్బెట్’ పేరుతో విడుదల చేసిన తొలి బైకు ధర రూ.89,999గా నిర్ణయించింది. ఈ బైకుపై ఏడేండ్ల వారెంటీ ఇస్తున్నారు. బ్యాటరీకి ఐదేండ్ల గ్యారెంటీ ఇస్తున్నారు. పోర్టబుల్ చార్జర్ కలిగిన ఈ బైకు ప్రతి ఇంట్లో రీచార్జి చేసుకునే వీలుంటుంది. రెండు బ్యాటరీల ఆప్షన్ కలిగిన ఈ బైకు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఈ నెల 12 నుంచి అంటే ఈరోజు నుంచే రూ.499 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. ఇలా బుకింగ్ చేసుకున్నవారికి రూ.3 వేల వరకు ప్రత్యేక రాయితీ ఇస్తారు.
We offer over 1 Billion+ charging points. Every 3 pin socket is a charging station with Swappable Battery!!
Book your “Strongest EV” in India at 499/- only. https://t.co/GqlhrzHJ9W#ElectricVehicles #Automotive@IndiaRelease https://t.co/kkdgtLqtJv
— BoomMotors (@Boom_Motors) November 12, 2021