ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అవ్వడంతో ప్రజలు ఎక్కడికక్కడ సరిహద్దులు దాటి పారిపోతున్నారు. ప్రాణ భయంతో ఆస్తిపాస్తులు, పిల్లల్ని సైతం వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో కాబూల్ మొట్టమొదటి మహిళా మేయర్ జెరిఫా గఫారి మాటలు అందరిలో ధైర్యం నూరిపోస్తున్నాయి.
చావుకైనా సిద్ధం కానీ, నేనెక్కడికీ పోను అని చెబుతున్నారామె. 27 ఏళ్ల జెరిఫా.. తాలిబన్లకోసం తాను వేచి చూస్తున్నానని చెబుతోంది. “వారు ఎలాగూ వస్తారు, నన్ను ఎలాగైనా చంపేస్తారు. వారికి మానవ హక్కుల గురించి తెలియదు, వారు క్రూరులు. అయినా సరే నేను భయపడి ఎక్కడికీ పారిపోను. చావుకోసం నేను సిద్ధపడే ఉన్నాను. నేను, నా భర్త, పిల్లలు అందరం నా సొంత ఊరిలోనే ఉన్నాం.” అని అన్నారామె.
‘I’m waiting for Taliban to come for people like me and kill me’ https://t.co/3Se2GhdvYL
— i newspaper (@theipaper) August 16, 2021
ఇవీ చదవండి..