కారు రెండుగా చీలింది.. టివి తారలు మృతి.

    0
    46870

    హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. గ‌చ్చిబౌలి నుంచి లింగంప‌ల్లి వెళుతున్న కారు ప్ర‌మాదానికి గురైంది. వేగంగా వెళుతున్న కారు అదుపుత‌ప్పి ఒక చెట్టును ఢీ కొట్టింది. ప్ర‌మాద స‌మ‌యంలో ముగ్గురు టీవీ ఆర్టిస్టులు ప్ర‌యాణిస్తున్నారు. కాగా ఈ ఘ‌ట‌న‌లో ఎన్.మాన‌స‌, ఎం.మాన‌స అనే ఇద్ద‌రు ఆర్టిస్టులు స్పాట్‌లోనే మృతి చెందారు. మ‌రో అమ్మాయి సాయిసింధు తీవ్ర గాయాల‌పాలైంది. డ్రైవింగ్ చేస్తున్న వ్య‌క్తి కూడా అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. కారు న‌డుపుతున్న వ్య‌క్తి బ్యాంక్ ఉద్యోగిగా గుర్తించారు. తాగిన మైకంలోనే కారు న‌డిపిన‌ట్లు తెలుస్తోంది. గాయ‌ప‌డిన సాయిసింధు ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. కారు చెట్టును ఢీ కొట్ట వేగం ఎలా ఉందంటే… కారు రెండు ముక్క‌లైంది.

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.