ఆస్తులేకాదు , కరోనాతో మరణిస్తే ఆప్తులు , పేగుతెంచుకుపుట్టిన బిడ్డలు , అయినవారుకూడా వెంటరాని ఓ దారుణంలో మానవత్వం వెల్లివిరిసింది. మానవతకు మతంలేదని , మనిషిగా ఉంటే చాలని నిరూపించారు కాటేపల్లికి చెందిన ఆలీ సోదరులు. మొగల్లయ్య అనే వ్యక్తి బాన్సవాడ హాస్పిటల్లో కోవిద్ తో మరణించాడు. మృతదేహాన్ని తీసుకునేందుకు అయినవాళ్లు నిరాకరించారు. దీంతో హాస్పిటల్ దగ్గరే అంబులెన్స్ నడుపుకునే ఆలీ సోదరులు ముందుకొచ్చి , మృతదేహాన్ని తామే తీసుకెళ్లి , దహనం చేశారు. కొరివిపెట్టాల్సిన కొడుకులు కాటికి కూడా రాలేదు.. ఇదీ నేటి కరోనా కుటిల నీతి. ..