అమర్ నాధ్ యాత్రలో ఇంతియాజ్ త్యాగం.

    0
    1104

    మానవత్వానికి మతం ఉండదు.. మానవత్వమే మతం.. అదీ జీవనవిధానం.. అమర్ నాధ్ యాత్రలో ఓ భక్తుడిని కాపాడిన ఇంతియాజ్ అనే యువకుడి మరణం , మిలిటరీ అధికారులకే కాదు , భక్తులకూ కన్నీరు తెప్పించింది. పెహల్గామ్ బేస్ క్యాంప్ లో విషాదం నింపింది.

    ఇంతియాజ్ 22 ఏళ్ళ యువకుడు.. తండ్రి అంధుడు.. భార్య , ఎనిమిది నెలల బిడ్డ ఉన్నారు. అతిక్లిష్టమైన అమర్ నాధ్ యాత్రలో , భక్తులను గుర్రాల మీద తీసుకుపోతుంటాడు. ఓ భక్తుడిని గుర్రం మీద తీసుకుపోతుండగా , అతడు స్పృహ తప్పి , గుర్రం మీదనుంచి కింద పడిపోవడాన్ని చూసాడు.

    అప్పటికి గుర్రం అతికష్టమైన , ఇరుకైన లోయ అంచుల్లో ఉంది. గుర్రం మీద నుంచి పడిపోతున్న వృద్ధుడిని , కిందకు దించి , అతడికి సపర్యలు చేసాడు. ఈ క్రమంలో అతడు కోలుకున్నాడు. మళ్ళీ గుర్రం ఎక్కిస్తుండగా , పట్టుతప్పి , లోయలోకి జారిపోయాడు. వెంటనే పర్వతారోహక సైనిక సిబ్బంది , అతికష్టం మీద ఇంతియాజ్ ని , పైకి తెచ్చి , వైద్యం కోసం తరలిస్తుండగా చనిపోయాడు..

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.