చిత్తూరు హీరో ప్లాంట్ నుంచి రాబోయే బైక్ ఇదే..

    0
    5706

    భారతీయ మార్కెట్లోకి ఇబ్బడిముబ్బడిగా ఎలెక్ట్రిక్ బైకులు, స్కూటర్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే కోవలో హీరో ఎలక్ట్రానిక్ బైక్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్న హీరో సంస్థ ప్లాంట్ లో ఈ బైక్ ను తయారు చేస్తున్నారు.

    భారతీయ మార్కెట్లో ఇప్పటివరకూ ప్రముఖ బైక్ తయారీ సంస్థగా ఉన్న హీరో బైక్స్ ..ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయబోతోంది. వచ్చే ఏడాది జనవరిలో గానీ.. ఏప్రిల్‌లో గానీ బైక్ ను విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బైక్ తయారీ కోసం టెక్ దిగ్గజం తైవాన్ కంపెనీ గొగోరోతో హీరో కంపెనీ ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

    ఇప్పటికే మార్కెట్లోకి అనేక కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేశాయి. ఇక ఇప్పుడు హీరో వంతు కూడా వచ్చేసింది. ఈ బైక్ ధరను కూడా లక్ష రూపాయల లోపే ఉండేలా కంపెనీ తీర్చిదిద్దుతుంది సమాచారం.

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.