శోభనం పెళ్ళికొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఎందుకో తెలుసా..?? శోభనం అంటే భయపడి.. ఇదేదో విచిత్రం , నమ్మలేని నిజం.. మాచర్లలో జరిగిందీ దారుణం. తెనాలికి చెందిన ఒక అమ్మాయితో మాచెర్ల కి చెందిన కిరణ్ కు పెళ్లయింది.. ఇంట్లో పూజలు, వ్రతాల తరువాత 16 వ తేదీ తెనాలిలో పెళ్లికూతురు ఇంట్లో శోభనం ఏర్పాటుచేశారు. ఇందుకోసం తెనాలికి బయలుదేరి గుంటూరులో బస్సు దిగారు. ఇప్పుడే వస్తానంటూ చెప్పి , పక్కకు వెళ్ళాడు. రాత్రి అయినా రాకపోవడంతో , పెళ్లికూతురు తెనాలికి చేరుకుంది. మొబైల్ కి ఎన్నిసార్లు చేసినా , సమాధానం లేదు. స్విచ్చాఫ్ అని వస్తోంది. రెండు రోజుల తరువాత , కృష్ణానదిలో శవం కనిపించింది. అది తమ కొడుకుదేనని తల్లి గుర్తించింది. పెళ్లి అయ్యాక శోభనం అంటే భయపడేవాడని చెప్పింది. కొడుకు స్నేహితులు కూడా దైర్యం చెప్పారని చెప్పింది. శోభనం కి భయపడే ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నామని తెలిపింది..