విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేయడంలో ఎన్ని రకాల మాయోపాయాలు ఉంటాయో… అన్నీ వాడేస్తుంటారు. గుండీల రూపంలో బంగారం తయారు చేసుకుని రావడం, కడుపులోబంగారం పెట్టుకురావడం , బంగారం పోతబోసిన మైక్రో ఓవెన్లు, కుక్కర్లు తీసుకురావడం ఇలా అన్ని రకాలుగా బంగారం స్మగ్లింగ్ ప్రయత్నం చేస్తున్నా… కస్టమ్స్ ఇంటిలిజెన్స్ అధికారులు పట్టేస్తుంటారు. తాజాగా చెన్నైలో దొరికన బంగారం స్మగ్లింగ్ మరీ విచిత్రమైంది.
ఓ వ్యక్తి 5 స్పానర్లను బంగారంతో తయారు చేయించి వాటిపై సిల్వర్ కోటింగ్ వేసి తీసుకొచ్చాడు. అడిగితే తాను ఓ కంపెనీలో టెక్నికల్ స్టాఫ్ అని స్పానర్లు, కటింగ్ ప్లేయర్లతో తనకు పని ఉంటుందని చెప్పారు. అందుకే వీటిని వెంట తెచ్చుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇవి మామూలు కటింగ్ స్పానర్లని చెప్పాడు. అయితే అధికారులకు అనుమానం రావడంతో … స్పానర్ల మీద ఉన్న కోటింగ్ను గట్టిగా రుద్దడంతో… లోపల బంగారం కనపడింది. ఆ స్పానర్లను తూకం వేస్తే ఒక కేజీ 2 గ్రాములు ఉన్నాయి. . ఆ బంగారం విలువ 40 లక్షలకు పైగా ఉంటుందని నిర్దారించారు. రియాద్ నుంచి ఈ స్మగ్లర్ స్పానర్లను తెస్తున్నాడు.. స్మగ్లింగ్ కు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశారు.