ప్రియుడు వద్దన్నాడని మెట్రో స్టేషన్ పైకి ఎక్కింది..

    0
    2169

    ఢిల్లీలోని ఫరీదాబాద్‌ మెట్రో రైల్‌ స్టేషన్ పైకి ఎక్కిన ఓ యువ‌తి ఆత్మహత్యాయ‌త్నం చేసింది. ఈ విష‌యంపై సమాచారం అందుకున్న ఎస్సై ధన్‌ ప్రకాశ్‌, కానిస్టేబుల్ సర్ఫ్‌రాజ్ అక్క‌డ‌కు వెళ్లారు. మెట్రో సిబ్బందితో క‌లిసి ఆ యువ‌తికి న‌చ్చ చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. స్టేషన్‌ కింద ఉన్న ఎస్సై ఆమెను మాటల్లోకి దించి దృష్టి మరల్చాడు. ఇంతలో పైకి ఎక్కి ఆమె వ‌ద్ద‌కు వెళ్లిన‌ కానిస్టేబుల్‌ సర్ఫ్‌రాజ్ ఆ అమ్మాయిని ఒక్క‌సారిగా ప‌ట్టుకున్నాడు. అనంత‌రం ఆమెను కింద‌కు తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. ప్రేమ‌లో వైఫ‌ల్యం కార‌ణంగానే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు ప్ర‌య‌త్నించింద‌ని స‌మాచారం.

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?