దాంపత్య జీవితంలో , భర్తచనిపోతే , భార్య , భార్యచనిపోతే భర్త , తల్లి లేదా తండ్రి చనిపోతే బిడ్డ ఆత్మహత్య చేసుకునే సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి.. అయితే , ప్రియుడు ప్రమాదంలో చనిపోతే , నువ్వులేని లోకం నాకొద్దని ప్రియురాలు కూడా ఆత్మహత్య చేసుకుంది..
కన్నవారికి కడుపు శోకం మిగిల్చింది.. ప్రేమలో పవిత్రతకూ నిదర్శనమై వెలిగింది.. ధనుష్ , సుష్మ ఇద్దరూ ప్రేమికులు.. గత రెండుళ్లుగా కొనసాగుతున్న ప్రేమకు పెళ్లితో ముగింపుచెప్పాలనుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్ళికి సిద్ధమయ్యారు. వచ్చే నెలలో నిశ్చితార్థం జరగాల్సివుంది..
ఈ లోగా అమ్మాయి ఊరు నెలమంగలలో ఒక జాతర జరగడంతో , ధనుష్ ఆ జాతరకు బైక్ పై బయలుదేరాడు.. కులనహళ్లి వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. ధనుష్ అంత్యక్రియల్లో పాల్గొన్న సుష్మ వారంపాటు , నిద్రాహారాలు మానేసింది.. చివరకు ధనుష్ లేనిలోకంలో తానుండలేనని చెప్పి విషం తాగి ఆత్మహత్యచేసుకుంది..