ప్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్ రెడ్డి, సినీ నటి కరాటే కళ్యాణిల గొడవలోకి శ్రీరెడ్డి ఎంటరయ్యింది. అసలే సోషల్ మీడియాలో కాక రేపుతున్న ఈ వివాదం కాస్తా ఇప్పుడు శ్రీరెడ్డి ఎంట్రీతో మరింత హీటెక్కింది. తాజాగా శ్రీరెడ్డి ఓ రేంజ్ లో కరాటే కళ్యాణిపై మండిపడింది.
చెత్త ముంజ.. ఏమనుకుంటున్నవే..? అంటూ వివాదాస్పద కామెంట్లు చేసింది. చిన్న పిల్లని అడ్డుపెట్టుకొని.. శ్రీకాంత్ రెడ్డిపై గొడవకు వెళ్తావా అంటూ ప్రశ్నించింది. గొడవలో చిన్నారికి గాయాలైతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. సంఘ సంస్కర్త పేరుతో ఇలా చేస్తావా అంటూ ఘాటుగానే మాట్లాడింది.
అయితే కరాటే కళ్యాణి, శ్రీకాంత్ రెడ్డి వివాదం నాలుగు రోజులుగా మీడియాలో వస్తున్న విషయం తెలిసిందే.. మహిళలను ప్రాంక్ వీడియోల పేరుతో అసభ్యంగా చూపిస్తున్నావంటూ కరాటే కళ్యాణి.. శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసింది.
ఆ తర్వాత శ్రీకాంత్ రెడ్డి కూడా కరాటే కళ్యాణిపై చేయి చేసుకోవడం తెలిసిందే.. గత మూడు రోజులుగా ఈ వివాదం మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటుగా.. సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. ఈ వివాదం తర్వాత కరాటే కళ్యాణి ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
కరాటే కళ్యాణి బాగా బలిసి కొట్టుకుంటుంది pic.twitter.com/cNjSmkqHF0
— Sri Reddy (@MsSriReddy) May 16, 2022