ఈమెవరు..? పెళ్లికూతురు.. చేతిలో ఉండేది , పెళ్ళికొడుకు మెడలో వేయాల్సిన పూలదండ.. మరి పెళ్లిమండపంలో ఉండకుండా , పెళ్లికూతురు డ్రెస్సులోనే , పెళ్లిమండపంనుంచి నేరుగా , పోలీస్ స్టేషన్ కు వచ్చేసింది. పెళ్ళికొడుకు , అతడి బంధువులపై కేసుపెట్టించి , గందగోళం చేసింది..
ఇంతకీ కారణం ఏమిటంటే , వరమాల కార్యక్రమం మొదలుకాబోతుండగా , పెళ్ళికొడుకు తిరకాసు పెట్టాడు. తనకు అదనపు కట్నం ఇస్తేనే , పెళ్లికూతురు మెడలో మాల వేస్తానని , తాళి కడతానని పెండింగ్ పెట్టాడు. పెళ్లికూతురు తరపున బంధువులు నచ్చజెప్పేందుకు ప్రయత్నంచేశారు..
అయితే , పెళ్లికూతురు ఫైర్ అయింది. తాళికట్టే ముందు , తనకు బేరం పెట్టిన పెళ్లికొడుకే తనకు వద్దంటూ , పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసుపెట్టింది.. మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లా షాపూర్ లో జరిగిందీ ఘటన..