ముళ్ల పంది అంటే పులికి రుచికరమైన ఆహరం.. ముళ్ల పందిని వేటాడి తినడం పులికి ప్రాణాంతకమే.. నోటికి , వంటికి , శరీరమంతా ముళ్ళు గుచ్చుకుంటాయి.. అయినా ముళ్ల పంది కనిపిస్తే చిరుత వదలదు.. ఎలాగైనా తినాలని చూస్తోంది.. ఒక్కోసారి మరణంకూడా అనివార్యం.. తాజాగా కర్ణాటకలోని మైసూరు జిల్లా బండీపుర పులుల సంరక్షణ ప్రాంతంలో ముళ్ల పందిని వేటాడి చిరుత చనిపోయింది. వళ్ళంతా ముళ్ళు గుచ్చుకొని , నరకయాతన పడి మరణించింది. చిరుతకు ఆరేళ్ళు వయసుంటుంది. ముళ్లపంది–పులి మధ్య జరిగిన పోరాటంలో పులి తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం పులి కళేబరాన్ని అక్కడే ఖననం చేశారు.
ఇవీ చదవండి..