నిజామాబాద్ ఇ -బైక్ పేలుడులో జరిగిందిదీ..

    0
    57

    ఇటీవ‌లికాలంలో ఎల‌క్ట్రిక్ బైక్ బ్యాట‌రీలు పేలిపోవ‌డం… వాటి కార‌ణంగా కొంత‌మంది చ‌నిపోతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. త‌మిళ‌నాడులో త‌ల్లికూతుళ్ళు ఇంటిలో నిద్రిస్తుండ‌గా చార్జింగ్ లో ఉన్న ఎల‌క్ట్రిక్ బైక్ త‌గ‌ల‌బ‌డి.. ఆ ప్ర‌మాదంలో మృత్యువాత ప‌డ్డారు. ఇలాంటి ఘ‌ట‌న‌లే పూణె, గుజ‌రాత్, అహ్మ‌దాబాద్ త‌దిత‌ర ప్రాంతాల్లోనూ చోటుచేసుకున్నాయి.

    తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ ప‌ట్ట‌ణంలో ఎల‌క్ట్రిక్ బైక్ బ్యాట‌రీ పేలిపోవ‌డంతో… ఓ యువ‌కుడు మృతి చెందాడు. మంగ‌ళ‌వారం రాత్రి సుభాష్ న‌గ‌ర్‌లో రామ‌కృష్ణ అనే వ్య‌క్తి త‌న ఎల‌క్ట్రిక్ బైక్ కి చార్జింగ్ పెట్టి నిద్ర‌పోయాడు. అయితే కొంత‌సేప‌టికి బ్యాట‌రీ పేలిపోవ‌డంతో ఆ ప్ర‌మాదంలో రామ‌కృష్ణ మృతిచెందాడు. ఆ ఇంట్లోని మ‌రో ముగ్గురు క‌మ‌ల‌మ్మ‌, కృష్ణ‌వేణి, క‌ళ్యాణ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారికి చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

     

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.