అప్పు చేసి భార్యను తాకట్టు పెట్టాడు..

    0
    3009

    స్నేహితులవద్ద తీసుకున్న అప్పు తీర్చలేక , ఓ తాగుబోతు భర్త భార్యను వాళ్లకు అప్పగించాడు. భర్త నీచపు ఆలోచనను తట్టుకోలేని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో , భర్తను , అతడి ఇద్దరి స్నేహితులను అరెస్ట్ చేశారు. కడలూరు జిల్లా ఎల్లర్ పాళ్యంకి చెందిన యువకుడు , అప్పులు తీర్చలేక భార్యను వాడుకోమని తన స్నేహితులు సుందరమూర్తి , మణికందన్ లకు చెప్పాడు. ఒప్పందం ప్రకారం భార్యకు ఈ విషయం చెప్పి , వాళ్లకు సహకరించాలని కోరాడు. ఆమె ఎదురుతిరిగి , పోలీసులకు చెప్తానని బెదిరించింది. దీంతో ఆమెకు కరోనా రాకుండా మాత్రలనిచెప్పి , మత్తు మాత్రలిచ్చి . స్నేహితులను రమ్మన్నాడు.

    మత్తులో ఉన్న ఆమెపై ఇద్దరూ అత్యాచారం చేశారు. మెలుకువ వచ్చిన తర్వాత జరిగిన ఘోరం తెలుసుకొని నిలదీసింది. చెడిపోయావు కాబట్టి , వాళ్ళను కాదనకుండా వాడుకో అని సలహా ఇచ్చాడు. మళ్ళీ రాత్రి , స్నేహితులు ఇద్దరూ తాగి రావడంతో , ఆమె ఎదురుతిరిగింది. అయితే భర్త ఆమెను బలవంతంగా గదిలోకి పంపి , తన ఫ్రెండ్స్ తో ఉండాలని వత్తిడి చేయడంతో కేకలు వేసింది. చుట్టుపక్కలవారు రావడంతో , తనపై జరిగిన అఘాయిత్యం చెప్పి , వాళ్ళ సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ముగ్గురినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు..

    ఇవీ చదవండి..

    నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

    ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

    అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

    నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..