కరోనా కేసుల్లో భారీ తగ్గుదల..

    0
    61

    దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారీ తగ్గుదల నమోదైంది. ఓ దశలో భారత్ లో రోజువారీ కేసులు 4,14,168గా నమోదయ్యాయి. అప్పటి సంఖ్యతో పోల్చి చూస్తే.. గడచిన 24గంటల్లో నమోదైన కేసుల సంఖ్య దాదాపు 50శాతం తక్కువ. తాజాగా సోమవారం భారత్ లో కొత్తగా 1,96,427 కేసులు నమోదయ్యాయి.

    భారత్ లో సెకండ్ వేవ్ మొదలైన తర్వాత ఏప్రిల్ నుంచి కేసుల సంఖ్య భారీగా పెరిగింది. లక్ష, 2 లక్షలు, 3 లక్షలు.. మే నెలలో ఒకరోజు కేసుల సంఖ్య 4 లక్షలకు చేరి పరిస్థితి భయాందోళనలకు దారి తీసింది. ఆ తర్వాత మే-9 నుంచి కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 3లక్షలకు దిగువకు కేసులు చేరాయి. ఆ తర్వాత ఇప్పుడు లక్షలకంటే తక్కువకు చేరడం విశేషం. ఏప్రిల్ 14 తర్వాత దాదాపుగా నెలన్నర రోజుల తర్వాత ఇప్పుడు కరోనా కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది.

    మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. క్రితంరోజు నాలుగు వేలకు పైగా మరణాలు నమోదు కాగా.. తాజాగా ఆ మార్కుకు దిగువన నమోదయ్యాయి. ఇక 24 గంటల వ్యవధిలో 3,511 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 2,69,48,874కి చేరగా.. 3,07,231 మంది ప్రాణాలు వదిలారు.

    ఇక క్రియాశీల కేసుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 25,86,782 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 10.17 శాతానికి చేరింది. నిన్న 3,26,850 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.4 కోట్లకు పైబడ్డాయి. రికవరీ రేటు 88.69 శాతంగా కొనసాగుతోంది. మరోవైపు నిన్న 24,30,236 మందికి కేంద్రం టీకాలు అందించింది. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 19,85,38,999కి చేరింది.

     

    ఇవీ చదవండి..

    ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

    వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

    కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

    రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు