గుడిసెలో కాపురం ఉండే పేదవాడికి 7 లక్షలు కరెంటు బిల్లు , బ్యాంకులో రూపాయి బ్యాలెన్స్ లేనివాడి ఖాతాలో 7 కోట్లు , అసలు బ్యాంకులో అప్పు లేనివాడికి 50 కోట్ల రూపాయలకు నోటీసులు.. ఇలాంటి చిత్ర ,విచిత్రాలు ,మన దేశంలోనే కాదు , విదేశాల్లోనూ జరుగుతుంటాయి. అలాంటిదే ఇదికూడా..
ఉదయాన్నే కొన్ని నిముషాలపాటు వాడిన గ్యాస్ కి , ఏకంగా ఓ యువ జంటకు 19,146 కోట్లరూపాయలు గ్యాస్ కంపెనీ నుంచి బిల్లు వచ్చింది. గ్యాస్ సరఫరా చేసే షెల్ కంపెనీ , ఈ బిల్లుని మొబైల్ యాప్ లో పంపించి , వెంటనే చెల్లించమని కోరింది.
ఇదేందని , కంపెనీని అడిగితే , మొబైల్ యాప్ లో పొరపాటు జరిగిందని ఒప్పుకుంది.. లెక్కల్లో తప్పులతడకలు , దాన్ని చూసి గుండె దడలు , ఏదేశంలో అయినా , షరా మామూలే.. అలాంటిదే ఇదికూడా..