ఈ కోడలు పోరాటం చాలా వెరైటీగా ఉంది.. ప్రేమించి పెళ్ళాడి , తర్వాత పారిపోయిన భర్త ఇంటిముందు తపస్విని అనే యువతి ధర్నా చేస్తోంది.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటిమెట్ల ముందే కూర్చొని నిరసన తెలుపుతొంది. భర్త సునీత్ ఆమెను , ప్రేమించి రిజిస్టర్ మేరేజ్ చేసుకున్నాడు. ఏడు నెలలు విడిగా కాపురంకూడా ఉన్నారు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన భర్త , ఇప్పుడు ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. అత్తింటి వాళ్ళే ఆయనను పంపించివేశారని ఆమె చెబుతొంది.. ఇంటిబయట మెట్లమీదనే పూజలు చేస్తోంది.. తన పూజలు ఫలించి భర్త మనసు మార్చుకొని వస్తాడని మనస్విని నమ్ముతొంది..