ఏపీలో ఈనెల 20 వరకు కర్ఫ్యూ గడువుని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈనెల 10తో కర్ఫ్యూ గడువు ముగుస్తుండగా దాన్ని మరో 10రోజులపాటు పొడిగించారు. అయితే కర్ఫ్యూ వేళలను మాత్రం సడలించారు. ఉదయం 6గంటలనుంచి, మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు సమయం ఉంటుందని తెలియజేశారు. అంటే మధ్యాహ్నం 12గంటలనుంచి 2 గంటల వరకు సడలింపు సమయాన్ని పెంచారు.