మనదేశంలో ఏ నగరం లేదా పట్టణం చూసినా వానలొస్తే , గుంటల్లో మృత్యువు కాపురం ఉంటుంది.. ఈ వీడియో చూడండి.. అలీగఢ్ లోనిదీ భయానకమైన వీడియో.. కొద్దిపాటి వర్షాలకు అలీగఢ్ వీధులలో మురికినీరు పొంగి రోడ్లమీదకొచ్చింది. ఒక పార్కింగ్ ప్లేస్ లో డ్రైనేజి గుంత పూడ్చలేదు. పాపం , ఓ వ్యక్తి భార్యతో స్కూటర్ పై వచ్చి దాన్ని పార్క్ చేసేందుకు వచ్చాడు. అయితే ఆ పార్కింగ్ స్థలంలో గుంత పూడ్చకపోవడంతో , స్కూటర్ నిలువేత్తు గుంటలో పడిపోయింది.
స్కూటర్ పై ఉన్న దంపతులిద్దరూ , మురికినీళ్ళ గుంటలో పడి పోయారు.. అయితే అదృష్టం ఏమిటంటే , చనిపోతూ , ఇద్దరూ ఆ నిలువెత్తుగుంటలో చేతులుపైకెత్తారు. వెంటనే అక్కడున్నవారు , వారిని పైకి తీశారు.. ఈ వీడీయో చూస్తే ఒక్క క్షణం వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.. మన మున్సిపాల్టీల్లోకూడా ఇలాంటి చావు గుంతలున్నాయి. వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండండి..
Visuals from UP's Aligarh.
Leaving this here. pic.twitter.com/bOhACL96IW
— Piyush Rai (@Benarasiyaa) June 18, 2022