చిరంజీవి పక్కన నటించాలని నవతరం హీరోయిన్లు కూడా కలలు కంటుంటారు. కానీ ఆ అవకాశం అనసూయకు దక్కింది. చిరు సరసన ఆమె నటించింది, ఆల్రడీ షూటింగ్ కూడా పూర్తయింది. ఇక బొమ్మ విడుదలవడం ఒక్కటే ఆలస్యం. ఇదేదో సినిమా అనుకునేరు. ఇది కేవలం ఓ యాడ్ మాత్రమే.
ఇటీవల వరుస సినిమాలు చేస్తున్న చిరంజీవి గ్యాప్ లో యాడ్ షూటింగ్ ల్లో కూడా పాల్గొంటున్నాడు. ఇటీవలే చిరు శుభగృహ రియల్ ఎస్టేట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన సంగతి తెలిసిందే. దీనికోసం చాలా రోజుల తరువాత చిరు కమర్షియల్ యాడ్ లో నటించాడు. గతంలో థమ్స్ అప్ యాడ్ లో నటించి రికార్డు సృష్టించిన మెగాస్టార్ ఆ తరువాత మరో యాడ్ లో నటించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఓ రియల్ ఎస్టేట్ కమర్షియల్ యాడ్ లో నటించారు. ఇక ఈ యాడ్ కి దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో చిరుతో పాటు సీనియర్ హీరోయిన్ ఖుష్బూ, హాట్ యాంకర్ అనసూయ కనిపించారు.