పగలు కౌంటింగ్ లో మాదే గెలుపు – చీకటి పడితే వైసిపి గెలుపు..బాబు థియరీ .

    0
    349

    పగలు కౌంటింగ్ లో మాదే గెలుపు – చీకటి పడితే వైసిపి గెలుపు..బాబు థియరీ .
    ====================================///
    ఓట్ల లెక్కింపు చీకటిపడక ముందే జరిగితే టిడిపి గెలుస్తోంది , చీకటిపడితే వైసిపికి అనుకూలం అవుతుందని ప్రతిపక్షనేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో ఆయన ఈ విషయాలు ప్రస్తావన చేశారు. త్వరగా లెక్కింపు పూర్తయిన గ్రామాల్లో ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నారు. రాత్రి 8 తర్వాత లెక్కింపు పూర్తయితే మాత్రం ఫలితాలు తారుమారు చేసి వైసిపికి అనుకూలంగా ఫలితాలు మారుస్తున్నారని అన్నారు.

    పోలీసులు , ఎన్నికల సిబ్బంది వైసిపి నేతలతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. పోలీసులు కౌంటింగ్ సెంటర్లలోకి వచ్చి తమ మద్దతున్న అభ్యర్థుల్ని, వారి ఏజెంట్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. చీకటి పడ్డాక కౌంటింగ్ సెంటర్లలో కరెంట్ ఆపేసి ఫలితాలు తారుమారు చేస్తున్నారని చెప్పారు.

    ఇవి కూడా చదవండి:

    మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

    ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

    బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?