దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ నేతలు తిరుపతి పార్లమెంటు చుట్టుప్రక్కల ప్రాంతాలనుంచి బస్సుల్లో, లారీల్లో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలను తీసుకురావటాన్ని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ దృష్టికి, కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఫోన్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్, కేంద్ర ఎన్నికల అధికారులతో తిరుపతి పార్లమెంట్ లో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వైసీపీవారిని టీడీపీ శ్రేణులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారని తెలిపారు. దొంగ ఓట్లపై వెంటనే చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.