తిరుమలలో భక్తులకు తిరునామాలు పెడుతూ వాళ్ళు ఇచ్చే దక్షిణ లక్షలు అయింది. పాపం ఆ పేద పురోహితుడు ఉన్న సంపదను అనుభవించకుండానే చనిపోయాడు. ఇది జరిగి ఏడాది అయింది. తిరుపతిలోని శేషాచలం కాలనీలో నిర్వాసితుల కోటా కింద శ్రీనివాసన్ కు టీటీడీ అప్పట్లోనే ఓ గదిని ఇచ్చింది. ఏడాది గడిచిన తర్వాత ఆ ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు టీటీడీ విజిలెన్స్ అధికారులు ట్రంకుపెట్టులో ఉన్న నోట్లను చూసి షాక్ అయ్యారు. 10 లక్షలకు పైగా నగదు ఆ ట్రంకు పెట్టులో ఉంది. వారసులు ఎవరూ లేకపోవడంతో ఆ సొమ్ము… తిరుమల శ్రీనివాసుడి హుండీలో వేయనున్నారు.