ఇంట్లో మనిషి చనిపోతేనే పట్టించుకునే రోజులు కాదివి. కర్మకాండల ఖర్చు దండగంటూ వెళ్ళిపోతున్న మనుషులూ ఉన్నారు. అలాంటిది తను ప్రేమగా పెంచుకున్న కుక్క చనిపోతే.. ఏకంగా దానికి విగ్రహమే కట్టించేశాడు ఓ యజమాని. కృష్ణాజిల్లాలో బాపులపాడు మండలం అంపాపురంకు చెందిన
జ్ఞానప్రకాష్ అనే వ్యక్తి ఓ కుక్కను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. ఆ కుక్క కూడా ఎంతో విశ్వాసంగా మెలిగింది. బిడ్డలాగా సాకాడు. దాని ఆలనాపాలనా చూసుకున్నాడు అయితే ఐదేళ్ళ క్రితం ఆ కుక్క చనిపోయింది. ఇంట్లో మనిషి దూరమైనంత బాధతో దాని అంత్యక్రియలు కూడా జరిపించాడు. తొలి సంవత్సరీకాన్ని ఘనంగా నిర్వహించారు. బంధుమిత్ర సపరివార సమేతంగా అందరినీ పిలిచి భోజనాలు పెట్టించాడు. ప్రతిఏడాది చేస్తూ ఇలా ఐదేళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు ఏకంగా ఆ కుక్క కోసం విగ్రహం కట్టించేశాడు. మామూలు విగ్రహం కాదండోయ్… కాంస్య విగ్రహం. కుక్క ఎంత పొడవు, ఎంత ఉంటుందో… అదేస్థాయిలో విగ్రహం ఏర్పాటు చేయడం విశేషం. ఈ కాంస్య విగ్రహావిష్కరణ కోసం శాస్త్రోక్తంగా పెద్ద క్రతువును జరిపించాడు. అందరికీ భోజనాలు పెట్టించాడు. ఎంతో విశ్వాసం చూపించిన కుక్కపై తనకున్న ప్రేమను ఇలా చాటుకున్నాడు జ్ఞాపప్రకాష్.
ఇవీ చదవండి..
ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?
అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?