పెళ్లి కూతురు కన్నీటి వెనక..
పెళ్లి కూతురు పెళ్లి మండపంలోకి వచ్చేటపుడు చేతిలో కొబ్బరికాయ పట్టుకుని రావడం కొన్ని వర్గాల్లో ఆనవాయితీ. అయితే ఇక్కడ పెళ్లి కూతురు మండపంలోకి వచ్చే సందర్భంలో తన తల్లి ఫొటో పట్టుకుని వచ్చింది. కన్నీటితో మండపంలోకి అడుగు పెట్టింది. పెళ్లి సంబంధం నిశ్చయం అయిన తర్వాత తన తల్లి చనిపోవడంతో ఆమెకు నివాళిగా ఆమె ఫొటోని పట్టుకుని మండపంలో అడుగు పెట్టింది వధువు. వెంట తండ్రి తోడు రాగా.. కన్నీటితోనే ఆమె మండపంలో కూర్చుని వివాహం చేసుకుంది. వధువు తన తల్లి ఫొటోని తీసుకుని రావడం తన తండ్రి పక్కనే ఫొటో ఉంచి.. తల్లిదండ్రులిద్దరి ఆశీర్వాదం అందినట్టు పెళ్లి చేసుకోవడం అక్కడ ఉన్న అందరి మనసుల్ని కదిలించింది. ఈ ఘటన ఇస్లామాబాద్ లో జరిగింది.
View this post on Instagram