వామ్మో , అమ్మాయిలు పెళ్ళిలో తాళికట్టేముందు వేసే డ్రామాలలో రోజుకో ట్విస్ట్.. ఎప్పటికప్పుడు కొత్తనాటకాలకు తెరలేపుతున్నారు.. ప్రియుళ్ళకోసం కొత్త స్క్రిప్టులు రెడీ చేస్తున్నారు.. తాజాగా , కర్ణాటకలోని మైసూరులో విద్యాభారతి కళ్యాణ మండపంలోపెళ్లికూతురు , పెళ్ళికొడుకు తాళి కట్టేందుకు , తాళిని చేతుల్లోకి తీసుకున్నవెంటనే , పెళ్లికూతురు సృహతప్పి పడిపోయింది.. నిజమేనేమో అనుకొని , అందరూ పాపం సపర్యలు చేశారు.
చివరకు అరగంటకు , పెళ్లికూతురు మెలుకువ వచ్చినట్టు నాటకం ఆడింది.. ముహూర్త కాలం ఇంకా ఉందని , అందువల్ల , పెళ్ళికి ఇబ్బందేమీ లేదని పురోహితుడు చెప్పి , కార్యక్రమం మొదలు పెట్టాడు.. అప్పుడు , పెళ్లికూతురు అడ్డం తిరిగింది.
తాను , పక్కింటి అబ్బాయిని ప్రేమించానని చెప్పింది. తనకు ఈ పెళ్లి ఇష్టంలేదని చెప్పింది. ఇష్టం లేకపోతే ఇంతవరకు ఎందుకు తెచ్చావంటే , మౌనంగానే ఉండిపోయింది. పెళ్ళికొడుకు , పోలీస్ స్టేషన్ కెళ్ళాడు. తమకు ఐదులక్షల రూపాయలు ఖర్చయిందని , మోసం చేశారని కేసు పెట్టాడు..
Bride refuses to marry at the last minute- says 'No' to the groom on the wedding day, and leaves the marriage hall with police protection. The incident happened at #Mysuru #Karnataka.@KeypadGuerilla Video pic.twitter.com/wlwc0bZ2qO
— Siraj Noorani (@sirajnoorani) May 22, 2022