పెళ్లికూతురు పరీక్షలు రాస్తోంది.. పెళ్లి అయిన తరువాత కాదు.. పెళ్ళికి ముందే.. శివంగి అనే ఈ అమ్మాయి డిగ్రీ చదువుతొంది.. అమ్మాయికి పెళ్లి సెటిల్ అయింది.. ఆ తరువాతే సెమిస్టర్ పరీక్షలు డేట్స్ వచ్చాయి.. పెళ్లి తరువాత పరీక్షలు రాయొచ్చు అనుకుంది.. అయితే ఆమె పెళ్లి ముహూర్తం సమయానికే పరీక్షలన్నారు. దీంతో ముహూర్తం మార్పించమని కోరింది. పెళ్లికొడుకు కూడా ఒప్పుకున్నాడు.. అయితే పరీక్షలు సమయం 12 గంటలకే ముగుస్తుంది. పెళ్లి ముహూర్తం 12 గంటల 15 నిముషాలు.. అందుకే పరీక్షలకు పెళ్లికూతురు అలంకరణ లోనే వచ్చేసింది.. పరీక్షలైన తరువాత నేరుగా కళ్యాణమండపానికి పోయి , తాళి కట్టించేసుకుంది.. గుజరాత్ లోని రాజ్ కోట్ లో జరిగిందీ ఘటన..