స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఏది చేసినా వెరైటీగా ఉంటుంది. తాజాగా సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్ డ్ బర్త్ డే విషెస్ చెప్పేందుకు ఆయన ఏకంగా నీళ్లలోనే దిగాడు. నీటిలోనే అడ్వాన్స్ బర్త్ డే విషెస్ అంటూ ప్లకార్డ్ పై రాసి అందరికీ షాకిచ్చాడు. ఈ బర్త్ డే విషెస్ వ్యవహారం జగన్ వద్దకు కూడా వెళ్లిందట. ఆయన కూడా ఈ వెరైటీ శుభాకాంక్షలు చూసి షాకయ్యారట. మరి బైరెడ్డా మజాకా..?
నెక్స్ట్ లెవల్..
బైరెడ్డి చెప్పిన శుభాకాంక్షల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెక్స్ట్ లెవల్ అంటూ అభిమానులు సిద్ధార్థ్ రెడ్డిని ఆకాశానికెత్తేస్తున్నారు. ఆయనకు జగన్ పై ఉన్న కొండంత అభిమానానికి ఇది నిదర్శనం అంటున్నారు.