భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో భారతీయులంతా విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి నుంచి సామాన్య పౌరుడి వరకు అందరూ సంతాపం ప్రకటించారు. దేశానికి, రక్షణ రంగానికి బిపిన్ రావత్ చేసిన సేవలను కొనియాడారు. అయితే రాజస్థాన్ కి చెందిన జవాద్ ఖాన్ అనే ఉన్మాది… రావత్ మృతిపై అభ్యంతర వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. బిపిన్ రావత్ నరకానికి పోతాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీంతో తీవ్రంగా స్పందించిన అధికారులు జవాద్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. అతని సోషల్ మీడియా స్టేటస్ ను పరిశీలిస్తే, తాలిబన్, ఐసీస్, ఉగ్రవాద సంస్థలకు సానుభూతిపరుడిగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.