బాలీవుడ్ హీరోయిన్ ఆయేషా టకియాపై పట్టపగలే గోవా ఎయిర్ పోర్ట్ లో లైంగిక వేధింపులకు గురి అయిందని సాక్షాత్ ఆమె భర్త ఫర్హన్ అజ్మీ ఆరోపిస్తున్నాడు. బాలీవుడ్ లో హీరోయిన్ అయిన ఆయేషా , తెలుగులో కూడా సూపర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తన భార్య పట్ల గోవా ఎయిర్ పోర్టులో ఓ అధికారి చాలా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె భర్త సోషల్ మీడియాలో తెలిపాడు . సొంత దేశంలోనే పట్టపగలు ఎయిర్పోర్టులో చెకింగ్ పేరుతో తన భార్య శరీరాన్ని టచ్ చేయడం , తన కళ్ళ ముందే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
గోవా నుంచి ముంబైకి ప్రయాణించేందుకు సిద్ధమయ్యాము. . ఆ సమయంలో ఎయిర్పోర్టులో ఏకే యాదవ్ , ఆర్పి సింగ్ అనే ఇద్దరు అధికారులు ఉన్నారు . వారిద్దరూ మమ్మల్ని చెకింగ్ కోసం లైన్లో నిలబడమన్నారు . మరో అధికారి నా భార్యను వేరే లైన్లో నిలబడమని సూచిస్తూ , ఆమెను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె భర్త ఆరోపించాడు.
తన భార్యను అలా అనవసరంగా చేయడానికి నీకు ఎంత ధైర్యం, ఆమెకు దూరంగా ఉండమని కోరాను. ఒకవేళ ఆమెను చెక్ చేయాలనుకుంటే లేడీ సెక్యూరిటీని పిలవమని అడిగాను. వినకపోగా , అసభ్యంగా కామెంట్స్ చేశారు.. సినిమా హీరోయిన్ పై పట్టపగలు జరిగిన ఈ లైంగిక వేధింపులపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఫిర్యాదు చేస్తే ఎయిర్ పోర్టు అధికారులు మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము , ఈ విషయాన్ని విచారించి తగిన చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారని చెప్పాడు..