మంత్రి గజమాలలో యాపిల్ పండ్లు మాయం.. ఎవరి పనో తెలుసా..?

    0
    1022

    ఇటీవలే జగన్ సెకండ్ టీమ్ లో చోటు దక్కించుకున్నారు ఆ మంత్రి. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారిగా జిల్లాకు వెళ్లారు. అభిమానులు ముచ్చటపడి ఆయనకు ఓ గజమాల వేశారు. అయితే ఆ మాలలో యాపిల్ పండ్లు కూడా గుదిగుచ్చారు. వెరైటీగా యాపిల్ గజమాలతో మంత్రిగారికి సత్కారం చేశారు. మంత్రిగారు ఎలాగూ ఆ మాల ధరించలేరు కాబట్టి.. క్రేన్ తో అలా వేసినట్టు చేసి ముచ్చట తీర్చుకున్నారు. ఆ తర్వాత మాలను ఓ పక్కనపెట్టారు. ఇంకేముంది యాపిల్స్ మాయం అయ్యాయి. ఎలా మాయమయ్యాయని అనుకుంటున్నారా.. ఇదిగో ఈ వీడియో చూడండి.

    మంత్రి ఉషశ్రీ చరణ్ కి వేసిన గజమాలలో యాపిల్స్ ని కార్యకర్తలు లాక్కోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది.

    ఇవీ చదవండి… 

    నడిచే థియేటర్.. ఇప్పుడు ఏపీకి వచ్చేసింది చూడండి.

    ప్రియుడుతో మామను చంపించిన కోడలు..

    పోలీసులన్నాక ఆ మాత్రం కళాపోషణ లేకపోతే ఎలా..??

    ఎమ్మెల్యే మేకపాటి తెల్లని బాతు లాంటివారు.. రెండో భార్య శాంత భలేచెప్పింది..