ఇటీవలే జగన్ సెకండ్ టీమ్ లో చోటు దక్కించుకున్నారు ఆ మంత్రి. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారిగా జిల్లాకు వెళ్లారు. అభిమానులు ముచ్చటపడి ఆయనకు ఓ గజమాల వేశారు. అయితే ఆ మాలలో యాపిల్ పండ్లు కూడా గుదిగుచ్చారు. వెరైటీగా యాపిల్ గజమాలతో మంత్రిగారికి సత్కారం చేశారు. మంత్రిగారు ఎలాగూ ఆ మాల ధరించలేరు కాబట్టి.. క్రేన్ తో అలా వేసినట్టు చేసి ముచ్చట తీర్చుకున్నారు. ఆ తర్వాత మాలను ఓ పక్కనపెట్టారు. ఇంకేముంది యాపిల్స్ మాయం అయ్యాయి. ఎలా మాయమయ్యాయని అనుకుంటున్నారా.. ఇదిగో ఈ వీడియో చూడండి.
ఒరేయ్…YCP కక్కుర్తి కార్యకర్తలు
ఇంత చెండాలంగా ఉన్నారేంట్రా…
యాపిల్ పళ్ళు ఎత్తకపోయే చిల్లర గాల్లు.. pic.twitter.com/vvmyU7Aep0— Sankar Gadipalli🔯😷🇮🇳 (@GadipalliRao) April 17, 2022
మంత్రి ఉషశ్రీ చరణ్ కి వేసిన గజమాలలో యాపిల్స్ ని కార్యకర్తలు లాక్కోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది.