మంచి చదువు , అంతకంటే మంచి ఉద్యోగం ..అయినా ఆ అమ్మాయి బుద్ది గడ్డి తినింది.. జైలుకెళ్లింది. హైదరాబాద్ లో కొండపనేని మానసి అనే యువతి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. అయినా వచ్చే జీతంతో సంతృప్తిపడక , డ్రగ్స్ అమ్ముతొంది. సహచరులకు గంజాయికూడా అమ్మేది. ఇవి కాకుండా విదేశాలకు చెందిన డ్రగ్ పిల్స్ , హాష్ ఆయిల్ లాంటి ప్రమాదకర మత్తు పదార్దాలను అమ్ముతొంది.
ఆమెతో పాటు , ఆమె భర్త , మరో ఇద్దరుకూడా ఇందులో భాగస్వాములు గా ఉన్నారు. ఇంతకాలం పరారీలో ఉన్న కొండపనేని మానసి, ఆమె భర్త మదన్ ను మేడ్చల్ జిల్లా , కొమ్మేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మానసి ఆంద్రప్రదేశ్ కు చెందిన యువతి. హైదరాబాద్ యువతలో ఇటీవల డ్రగ్స్ వాడకం ఎక్కువైంది. రెండు రోజులు క్రితం ఓ యువకుడు ఎక్క్కువగా డ్రగ్స్ తీసుకొని చనిపోయాడు. సినిమా ,సాఫ్ట్ వేర్ రంగంలో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు..