తమిళనాడు రాష్ట్రంలో కూనూర్ ప్రాంతంలో కూలిన రక్షణశాఖ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన 14 మందిలో మన రాష్ట్రానికి చెందిన తెలుగు యువకుడు ఉన్నాడు. ఈ ప్రమాదంలో డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ తో సహా 13 మంది మరణించారు. వారిలో చిత్తూరు జిల్లా కురబలకోట, ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ అనే యువకుడు ఉన్నారు. ఆ యువకుడు రక్షణ శాఖలో లాన్స్ నాయక్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆర్మీ అధికారి బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా సాయితేజ విధులు నిర్వహిస్తుండగా దుర్ఘటన జరిగింది.