అనంతపురం జిల్లా కల్యాణ దుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ర్యాలీ కారణంగా ఓ పసిపాప ఆస్పత్రికి వెళ్లడం ఆలస్యమై చనిపోయిందంటూ వచ్చిన కథనాలను అనంతపురం జిల్లా పోలీసులు ఖండించారు. వాస్తవం ఇదీ అని సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టారు. అమ్మాయికి ఫిట్స్ రావడంతో వారి తల్లిదండ్రులు పాపను బైక్ పై ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ర్యాలీ వల్ల వారు ఆస్పత్రికి వెళ్లడం ఆలస్యమైందనేది ఫిర్యాదు. కానీ ఆ పాపను ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ఎక్కడా వారికి ట్రాఫిక్ అవాంతరం ఎదురు కాలేదని పోలీసులు చెబుతున్నారు. తప్పుడు కథనాలు రాసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈమేరకు పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని విడుదల చేశారు.
కళ్యాణదుర్గంలో నిన్న ఆర్డీటీ ఆసుపత్రికి 8 నెలల చిన్నారిని తీసికెళ్తున్న బైకును పోలీసులు ఎక్కడైనా ఆపారా… ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది వాస్తవం@APPOLICE100@dgpapofficial #APPolice#AndhraPradeshStatePolice#anantapurpolice pic.twitter.com/RQVekv2f9T
— Anantapur Police (@AnantapurPolice) April 16, 2022