రేపల్లె రైల్వేస్టేషన్లో మహిళపై సామూహిక అత్యాచారం ఘటన , సభ్యసమాజానికే తలవంపులు.. అంతేకాదు , మనుషులన్న వాళ్లలో కనీస జాలి , దయ , సానుభూతి లేవనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం..
రైల్వే స్టేషన్ లో తనను కొట్టి , తన భార్యను పక్కకు తీసుకెళ్లి అత్యాచారం చేస్తున్నారని , భర్త స్టేషన్ లో ఉన్న కొంతమంది మహిళలవద్ద మొరపెట్టుకున్నాడు. మేమేమి చేస్తామంటూ , వాళ్ళు మొహం తిప్పేశారు. స్టేషన్ బయటనున్న వారికి చెప్పుకొని ప్రాధేయపడితే , కొంచెం దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది ..అక్కడకు పో , అన్నారు. అక్కడకు పోయి , తిరిగివచ్చేపాటికి , జరగాల్సిన ఘోరం జరిగిపోయింది..
అసలు ఈ సంఘటనలో బాదితురాలు , ఆమె భర్త , కూలీ పనులకోసం వచ్చి , అవనిగడ్డకు బస్సులేకపోవడంతో , రాత్రికి , రైల్వే స్టేషన్ లో భద్రత ఉంటుందని అక్కడే చెక్క బల్లపై పడుకున్నారు. ముగ్గురు వ్యక్తులు వచ్చి , భర్తను నిద్రలేపి , టైమెంత అనిఅడిగారు.. వాచీ లేదనడంతో , వాచీ ఎందుకు లేదని కొట్టారు.
తరువాత , అతడి భార్యను లేపి లాక్కుపోయేందుకు ప్రయత్నం చేశారు. అడ్డుపడ్డ భర్తను , దారుణంగా కొట్టి , ఆమెను పక్కనే ఉన్న ప్రదేశానికి లాక్కెళ్లారు. దగ్గరకొస్తే చంపేస్తామని హెచ్చరించారు. ఈ విషయం చెప్పి సాయం అడిగినా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు , పోలీసులు , ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు.. ఇందులో ఒకడు మైనర్..